''మగధీర'' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రాజమౌళి మర్యాద రామన్న, ఈగ చిత్రాలను తీసి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా లెజెండ్ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్తో సినిమా చేస్తున్నాడు. పూరీజగన్నాథ్ విషయానికి వస్తే.. బన్నీతో ఇద్దరమ్మాయిలతో తర్వాత నితిన్తో హార్ట్ ఎటాక్ చేశాడు.
ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా తర్వాత నాగబాబు తనయుడు వరుణ్తేజ్తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి రాజమౌళి ఫార్ములాను కొందరు డైరక్టర్లు ఫాలో అయినా.. త్రివిక్రమ్, శ్రీనువైట్ల వంటి డైరక్టర్లు మాత్రం తమ దారి తాము చూసుకుపోతున్నారు. ఏది ఏమైనా రాజమౌళి ఫార్ములా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా హిట్ ఫార్ములాగా మారుతుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.