వరుణ్ మణియన్తో సినిమానా అస్సలు చేయనని త్రిష గట్టిగా చెప్తోంది. త్వరలో పెళ్ళి పీటలెక్కుతారనుకున్న వరుణ్ మణియన్, త్రిష అనూహ్యంగా విడిపోయిన సంగతి తెలిసిందే. కేవలం వివాహ బంధాన్నే కాదు. రీలు బంధాన్ని కూడా పూర్తిగా తెంచుకోవాలని త్రిష అనుకుంటోంది. ఇంతకుముందే వరుణ్ మణియన్ బ్యానర్లో జై హీరోగా నటించనున్న చిత్రం నుంచి త్రిష తప్పుకుంది.
తాజాగా సెల్వరాఘవన్, శింబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు నుంచి కూడా త్రిష వైదొలగింది. ఈ చిత్రాన్ని వరుణ్ మణియన్ నిర్మిస్తున్న కారణంగానే త్రిష తప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వరుణ్కు పూర్తిగా దూరంగా ఉండాలనే ఈ సినిమాకు త్రిష గుడ్ బై చెప్పేసిందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.