ఎం.ఎస్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా 'సత్యం వైపు మార్గం'. విజయ్చందర్, రూపారెడ్డి బసవ, సూర్య, సంధ్యాఝనక్, శివ, జయశ్రీ నాయుడు, ముఖేష్, ప్రియాంక అగస్టియన్, చంద్రశేఖర్, నాగబాబు కీలక పాత్రధారులు. ఈ నెల 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... నేను దర్శకత్వం చేసిన తొలి సినిమానే జీసస్ మీద చేయడం ఆనందంగా భావిస్తున్నాను. దేవుడంటే ఇష్టం లేని అమ్మాయికి, జీసస్ కి మధ్య జరిగే కథ ఇది. సందేశం కూడా వుంది. జీసస్ అనగానే అందరికీ విజయ్ చందర్ గుర్తుకొస్తారు. ఈ సినిమాలో మరోసారి ఆయన జీసస్ గా కనిపిస్తారని తెలిపారు.