భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నట్టు, వారిద్దరు విడిపోయారలనే వార్తలు వెల్లడవుతున్నాయి. క్రేజీ లవర్స్గా వెలిగి ఈ జంట విడిపోయారనే వార్త ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ విషయంలో వారిద్దరూ నోరుమెదపనప్పటికీ, దూరంగా ఉన్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
ఆ మధ్య ఎక్కడ చూసినా ఈ జంట కనిపించేది. దేశంలోనే కాదు టీమిండియా విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో కూడా అనుష్క అక్కడ వాలిపోయేది. వారిద్దరూ ఒకర్ని వదలి మరొకరు ఉండలేనంతగా, చట్టా పట్టాలు వేస్కొని వెళ్తున్న ఫోటోలు మీడియాలో హల్ చల్ చేశాయి. కోహ్లీ సెంచరీ కొట్టంగానే గ్రౌండ్ నుంచి గ్యాలరీలో కూర్చున్న తన ప్రియురాలికి ఫ్లయింగ్ కిస్లు పంపేవాడు. అది అప్పుడు పెద్ద దుమారాన్నే రేపింది.