షూటింగ్ పూర్తి కాగానే విశాల్ తన బస చేసిన హోటల్కు వెళ్లి కాసేపు టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను చూశారు. ఆ తర్వాత స్థానిక చానెల్స్ను చూసిన విశాల్ షాక్కు గురయ్యారు. ఇటీవల విడుదలైన రెండు తమిళ చిత్రాలను ఎలాంటి హక్కుల లేకుండా ప్రదర్శిస్తున్న విషయాన్ని ఆయన గమనించారు. దీంతో విశాల్ కారకుడై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో రంగంలోకి దిగిన పోలీసులు పైరసీకి పాల్పడిన పళ్లత్తూర్ ముహ్మద్ మంజూర్, సంపత్లను అరెస్టు చేశారు. వారి నుంచి పైరసీ సీడీల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.