తాజాగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్న నిత్యామీనన్... స్టార్ హీరో, స్టార్ డైరక్టర్ అయినా ఏమాత్రం పట్టించుకోదు. ఆమెకు నచ్చిన పాత్ర లభిస్తే పారితోషికం విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోని నిత్య ఈ మధ్య ఓ నిర్మాతకు భారీ షాక్ ఇచ్చిందట. బాలీవుడ్లో హిట్ అయిన 'క్వీన్' సినిమాను దక్షిణాది భాషల్లోకి అనువదించాలని నిర్మాత త్యాగరాజన్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారట.
ఈ సినిమాలో కంగనా రనౌత్ చేసిన పాత్రకు సమంత, నయన్, అనుష్క తదితరుల పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు నిత్యామీనన్ను సంప్రదించారట. ఏమాత్రం లేట్ చేయని నిత్య సినిమాకు ఓకే చెప్పిందట. అయితే రూ. 2 కోట్ల పారితోషికం కావాలని కోరిందట. దీంతో, త్యాగరాజన్ బిత్తరపోయారట. నిత్యకు రెండు కోట్లు ఇచ్చే బదులు మరో స్టార్ హీరోయిన్ను పెట్టుకుంటే, సినిమాకు పబ్లిసిటీ కూడా వస్తుందనే ఆలోచనలో పడ్డారట.