అక్కినేని ఫ్యామిలీ 'మనం'లో మంచు విష్ణు విలన్‌గా...?!!

మంగళవారం, 1 అక్టోబరు 2013 (14:44 IST)
WD
అక్కినేని కుటుంబ చిత్రంలో మూడు తరాలుగా నటిస్తున్న 'మనం' చిత్రంలో మంచు మోహన్‌బాబు తనయుడు విష్ణు నటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నాగ్‌, విష్ణు కలిసి 'కృష్ణార్జున'లో నటించారు. ఈ విషయాన్ని ఈరోజు సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.

ముందుగా విష్ణు చిత్రం దూసుకెళ్తా గురించి అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున మాట్లాడుతారని మెసేజ్‌లు వచ్చాయి. అయితే.. దూసుకెళ్తాలో నాగార్జున గానీ, అక్కినేని గానీ నటిస్తున్నారేమోనని అనుమానాలు కూడా వున్నాయి.

మరోవైపు ఈ సినిమా గురించి కాదు.. మనం గురించి అని తెలిసింది. అయితే ఇందులో విష్ణు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడనేది సస్పెన్స్‌. కొందరయితే విలన్ పాత్ర అని గుసగుసలు పోతున్నారు. అసలు సంగతి త్వరలో తెలియనుంది. కాగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రియ, సమంత హీరోయిన్లు.

వెబ్దునియా పై చదవండి