'ఎవడు' కోసం మిడ్ నైట్లో శ్రుతి హాసన్... చుట్టేసిన ఫ్యాన్స్

బుధవారం, 6 మార్చి 2013 (22:16 IST)
WD
శ్రుతి హాసన్‌ను ఫ్యాన్స్ చుట్టేశారట. అదీ అర్థరాత్రి సమయంలో. విషయం ఏంటయా అంటే, రామ్ చరణ్ చిత్రం 'ఎవడు' సినిమా షూటింగులో పాల్గొనేందుకు శ్రుతి హాసన్ హైదరాబాద్ వచ్చింది. వస్తే ఎక్కడో ఒకచోట బస చేయాలి కదా. అందుకే హైదరాబాదులోని బంజారా హిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో దిగింది.

ఎందుకో గానీ అర్థరాత్రి వేళ లాబీలోకి వచ్చి అలా బయట తిరుగుతూ ఫ్యాన్స్ కంటబడింది. అసలే సెక్సీ హీరోయిన్. అందునా గబ్బర్ సింగ్‌తో టాలీవుడ్ కుర్రకారు నరాలను జివ్వున లాగేసిన భామాయే. చూస్తే ఊరుకుంటారా... శ్రుతి హాసన్‌ను చుట్టేసేందుకు గుమిగూడారట. దీంతో అందరికీ హాయ్ చెప్పేసి ఎంచక్కా హోటల్ లోపలికి చెక్కేసిందట శ్రుతి బ్యూటీ.

వెబ్దునియా పై చదవండి