దుబాయ్‌లో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న నయన!

గురువారం, 27 డిశెంబరు 2012 (14:57 IST)
FILE
ప్రభుదేవాతో ప్రేమాయణానికి బ్రేక్ పడిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన నయనతార ప్రస్తుతం సినీ ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రభుదేవాతో వివాహం కోసం హిందూ మతాన్ని స్వీకరించిన నయనతార ప్రస్తుతం క్రిస్ మస్ వేడుకల్ని దుబాయ్‌లోని తన కుటుంబీకులతో సరదాగా గడుపుకుంది.

ప్రభుదేవాతో ప్రేమాయణం చర్చనీయాంశమైన నేపథ్యంలో.. శ్రీరామ రాజ్యం సినిమాతో సినిమాలకు నయన స్వస్తి చెబుతుందని అందరూ అనుకున్నారు. ఇంకా ప్రభు కోసం హిందూ మతాన్ని కూడా నయనతార స్వీకరించింది. అలాగే సినిమాల్లో నటించేందుకు కూడా గుడ్ బై చెప్పేసింది.

కానీ ఏమైందో ఏమోగానీ ప్రభుదేవాకు దూరమైన నయనతార.. రెండో ఇన్నింగ్స్ ఆరంభించి సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యింది. అలాగే తన కుటుంబీకులతో ఎప్పటిలా హ్యాపీగా క్రిస్ మస్ పండుగను జరుపుకుంది.

వెబ్దునియా పై చదవండి