రామ్ చరణ్ కోసం కత్తెర పుచ్చుకున్న చిరు!

గురువారం, 5 డిశెంబరు 2013 (13:46 IST)
FILE
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ 'తుఫాన్' సినిమా ప్లాప్ నుంచి బయటపడటానికి చాలా ట్రై చేస్తున్నాడు. అందుకు తన దగ్గర ఉన్న 'ఎవడు'ను ఆయుధంలా వాడుకోవడానికి సిద్ధమయ్యాడు. ఎలాగైనా 'ఎవడు' సినిమాతో సక్సెస్ కొట్టి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. రామ్ చరణ్‌ను ప్లాపుల గండం నుంచి బయటపడేయడానికి ఏకంగా చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

'ఎవడు' సినిమా విషయంలో చిరు కత్తెరపట్టి అనధికారిక ఎడిటర్‌ బాధ్యతలు నిర్వహించారట.
గతంలో కూడా చిరంజీవి 'మగధీర', 'రచ్చ', 'నాయక్' సినిమాల ఎడిటింగ్‌ను దర్శకుడుని దగ్గర పెట్టుకుని చిరంజీవి ఎడిట్ చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' సినిమా విషయంలో కూడా అదే జరిగిందట.

ముఖ్యంగా రచ్చ, నాయక్ సినిమాల సమయంలో చిరంజీవి కీలక పాత్ర పోషించారు. ఆ చిత్రాలకి చిరంజీవి చెప్పిన మార్పులని అమలు చేయడంతో సినిమాలో విషయం పెద్దగా లేకపోయినా ఆయన జడ్జిమెంట్‌ కరెక్ట్‌ అని ముద్ర పడిపోయింది. కాగా చరణ్‌ తొలి బాలీవుడ్‌ చిత్రం 'జంజీర్‌' ఫ్లాప్‌ అవడంతో ఇప్పుడు చరణ్‌ 'ఎవడు'పై ఒత్తిడి ఎక్కువగా ఉంది.

ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడడంతో పాటు.. సినిమా మీద నెగటివ్ టాక్ కూడా ఉంది. అందుకే చిరంజీవి ఈ చిత్రం విషయంలో చాలా కేర్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. చిరు చెప్పిన మార్పులను ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ఇద్దరూ అమలు చేశారట. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి!

వెబ్దునియా పై చదవండి