రామ్ చరణ్, వెంకీ, కృష్ణలతో కృష్ణవంశీ 'అన్నదమ్ముల సవాల్'?

గురువారం, 8 ఆగస్టు 2013 (16:37 IST)
WD
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్ తర్వాత మల్టీ స్టారర్ చిత్రాలను తీసేందుకు దర్శకుడు కృష్ణవంశీ కంకణం కట్టుకున్నాడట. ఈ క్రమంలో రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణలతో చిత్రాన్ని తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

ఇప్పటికే ముగ్గురు హీరోలకు ఈ కథను వినిపించినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రానికి అన్నదమ్ముల సవాల్ అనే పేరు పెడితే ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతున్నట్లు భోగట్టా.

రామ్ చరణ్ తేజకు ఈ కథ బ్రహ్మాండంగా నచ్చడంతో కృష్ణవంశీ తదుపరి విక్టరీకి, కృష్ణలకు కూడా వినిపించి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. కాగా రామ్ చరణ్, వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ల కోసం కృష్ణవంశీ వేట మొదలెట్టారట. మొత్తానికి సీతమ్మ వాకిట్లో.... తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మల్టీ స్టారర్ మంచిరోజులను తెచ్చాయి.

వెబ్దునియా పై చదవండి