త్రీ ఇడియట్స్ సీక్వెల్... అమీర్ ఖాన్ - రాజ్‌ కుమార్ హిరానీ కాంబినేషన్‌లోనే....

గురువారం, 26 మే 2016 (14:18 IST)
రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 2009లో విడుదలైన చిత్రం ''త్రీ ఇడియట్స్''. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కరీనాకపూర్ జంటగా నటించారు. కాలేజ్ నేపథ్యంగా సాగే ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌ అయ్యింది. తెలుగు, తమిళంలో కూడా ఈ చిత్రం రీమేక్ చేయగా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందట. 
 
ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో రాజ్‌కుమార్‌ హిరానీ అమీర్‌‌ను కలిసి 'త్రీ ఇడియట్స్‌' సీక్వెల్‌ తీద్దామని చెప్పాడట. దీనికి అమీర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం అమీర్ 'దంగల్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 
 
కాగా రాజ్ కుమార్ హిరానీ 'సంజయ్ దత్' జీవిత కథాంశంగా రణబీర్ కపూర్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తికాగానే "త్రీ ఇడియట్స్'' సీక్వెల్ ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి