రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 2009లో విడుదలైన చిత్రం ''త్రీ ఇడియట్స్''. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కరీనాకపూర్ జంటగా నటించారు. కాలేజ్ నేపథ్యంగా సాగే ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. తెలుగు, తమిళంలో కూడా ఈ చిత్రం రీమేక్ చేయగా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందట.