బాబీలోనా మంత్రగాడి చేతిలో చిక్కుకుందా? గత ఏడాదే పెళ్లైపోయిందట.. మరి కేసు?

గురువారం, 1 డిశెంబరు 2016 (10:20 IST)
శృంగారతార బాబీలోనా నానమ్మ కృష్ణకుమారి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. మంత్రగాడి చేతిలో తన మనవరాలు చిక్కుకుందని.. తన మనవరాలిని రక్షించాలని కోరింది. సాలిగ్రామంలో నివసిస్తున్న కృష్ణకుమారి గత మంగళవారం చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు ఓ ఫిర్యాదు అందజేస్తూ... ‘పిరందాచ్చు’ అనే చిత్రంతో నా మనవరాలు బాబీలోనా సినిమాల్లోకి ప్రవేశించిందని, ఆమెను ఉన్నత స్థాయికి చేర్చేందుకు తానెంతో కృషి చేశానని పేర్కొన్నారు. 
 
అయితే ఆరణి ప్రాంతానికి చెందిన సుందర్‌ పాల్‌రాజ్‌ అనే వ్యక్తి తాంత్రిక చర్యలతో తన మనవరాలు బాబీలోనాని వశం చేసుకొన్నాడని, అతడి చెర నుంచి తన మనవరాలిని విడిపించాలని కృష్ణకుమారి పోలీసులను కోరారు. ఓ జిమ్‌లో పరిచయమైన సుందర్‌ పాల్‌రాజ్‌తో ప్రేమలో పడిన బాబీలోనా గత ఏడాది వివాహం చేసుకున్నారు. అయితే తామిద్దరికీ వివాహం అయిపోయిందని.. కృష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదును కొట్టేయాలని బాబీలోనా పోలీసులను కోరారు. భర్త పైనే ఫిర్యాదు చేయడంపై ఆమె బామ్మపై కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి