చిరంజీవి తర్వాత బన్నీని టార్గెట్ చేసిన ఆ దర్శకుడు?

శుక్రవారం, 12 జూన్ 2020 (08:55 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న స్టార్ దర్శకుల్లో కొరటాల శివ. సామాజిక నేపథ్యంతో చిత్రాలు తీస్తూ ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో "ఆచార్య" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవాయల భూముల స్కామ్‌లను ఈ చిత్రంలో చూపించనున్నట్టు సమాచారం. 
 
మరోవైపు, ఈ చిత్రం తర్వాత కొరటాల శివ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
 
నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో ఎప్పటి నుంచో ఉంది. అది ఎట్టకేలకు ఇప్పుడిది కార్యరూపం దాల్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. 
 
బలమైన సామాజిక సందేశమున్న కథాంశంతోనే కొరటాల తనదైన శైలిలో ఈ స్క్రిప్ట్‌ను రాసుకున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. 
 
కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్‌ లెక్కల మాస్టారు సుకుమార్‌ దర్శకత్వంలో 'పుష్ప' చేస్తున్నారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య'ను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే వీళ్లిద్దరి కలయికలో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు