అసలు కథేంటంటే... కోహ్లీ ఎక్కడికి వెళితే, అక్కడకు వాలిపోయే అనుష్క, ఈ సారి టీమిండియాని గెలిపించడానికి కోహ్లీ ఆస్ట్రేలియాలో చెమటోడ్చుతుంటే.. అనుష్క మాత్రం ఇండియాలోనే ఉంది.
అయితే వెళ్లాలని ఉన్నా.. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ఖాన్ ముందు అనుష్క శర్మ పప్పులు ఉడకవు. అందుకే పాపం అనుష్క, కిమ్మనకుండా 'పికె' సినిమాకి పబ్లిసిటీ ఇస్తూ, ఇండియాలోనే ఉండిపోయిందట.
ఆమె ఇక్కడే ఉన్న, ఆమె మనసు మాత్రం ఆస్ట్రేలియాలో చెక్కర్లు కొడుతోందని కొందరు అంటుండగా, కెరీర్ పట్ల అనుష్క డెడికేషన్ని ఎవరూ క్వశ్చన్ చేయలేరని ఆమె ఫ్రెండ్స్ అంటున్నారు.