రాఘవన్ సీక్వెల్‌లో అనుష్క.. గౌతమ్ మీనన్ కథ నచ్చిందట..!

మంగళవారం, 24 మార్చి 2020 (19:42 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన రాఘవన్ సినిమా తెలుగులో విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రానుందని టాక్ వస్తోంది. కమల్‌హాసన్ ప్రస్తుతం ''ఇండియన్ 2'' చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాతే ''రాఘవన్'' సీక్వెల్ ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన రాఘవన్ (తమిళంలో వేటైయాడు-విలైయాడు) సినిమా సీక్వెల్‌లో అనుష్క నటించనుందట. 
 
ఇంకా కథ నచ్చడంతో ఇందులో నటించేందుకు స్వీటీ అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అనుష్క తాజా చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని కోన వెంకట్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే రాఘవన్ సీక్వెల్‌లో నటించే అవకాశం రావడంతో ప్రస్తుతం స్వీటీ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు