రిలీజ్‌కు ముందే 'బాహుబలి-2' సంచలనాలు... తమిళనాడు హక్కులు రూ.50 కోట్లు!

సోమవారం, 25 జులై 2016 (16:09 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్ర 'బాహుబలి-2' షూటింగ్ పూర్తికాకముందే, విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం 2017 ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఈ చిత్రం పంపిణీ హక్కులను సొంతం చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు.
 
ఇప్పటికే ఈ చిత్రం ఓవర్‌సీస్‌ హక్కులు ఓ కంపెనీ ఏకంగా రూ.37 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో ఇది ఒక రికార్డు. ఇక ఈ సినిమాకు సంబంధించి తమిళనాడు హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్‌ రూ.50 కోట్లు చెల్లించినట్టు వార్తలు వస్తున్నాయి. విడుదలకు ముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్న ‘బాహుబలి-2’.. విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. 

వెబ్దునియా పై చదవండి