'బాహుబలి' పార్ట్ 1 ఇప్పటికే అనేకసార్లు టీవీలో రావడం, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉండటం, ఇప్పటికే సినిమా డివీడీల రూపంలో కూడా రావడంతో ఎవరూ మళ్లీ భారీగా డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా థియేటర్స్ అద్దె, ఇతర ఖర్చుల రూపంలో భారీగానే నష్టం వచ్చిందట.
కాగా, ఈనెల 28న 'బాహుబలి పార్ట్ 2- ది కంక్లూజన్' రిలీజ్ కానుంది. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రాన్ని 6500 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రూ.1000 వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.