ఆశ్చర్యపోకండి.. నిజంగానే దర్శకుడు రాజమౌళికి హైదరాబాద్లో సిసిఎస్ పోలీసులు నోటీసులు జారీచేయనున్నారు. విషయం ఏమంటే... ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించిన 'బాహుబలి' సినిమా గురించి. జనవరిలో చిత్ర నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినిమాలోని యుద్ధ సన్నివేశాలు కొన్ని బయటకు వచ్చాయి. ఇవి గత నెలలో పోలీసులు శోధించి.. గ్రాఫిక్స్ వర్క్లో పనిచేస్తున్న మూర్తి ద్వారా వచ్చాయని నిర్ధారణ చేశారు. కానీ అతను ప్రస్తుతం పనిచేయడం లేదట.
ఇవి తెలవాలంటే.. ముందుగానే రాజమౌళిని పోలీసు కార్యాలయానికి పిలిపించాలి. అందుకు ముందుగా నోటీసులు ఇవ్వాలి.. అదన్నమాట. మరో రెండు రోజుల్లో రాజమౌళికి నోటీసులు ఇస్తామని.. ఆయన వచ్చి తమకు క్లారిటీ ఇస్తే సరిపోతుందనీ, లేకపోతే... ఇవి మార్ఫింగ్ చేసిన దృశ్యాలుగానే పరిణగణిస్తూ... ఇంత గొడవ చేసినందుకు తిరిగి కేసు కూడా పెట్టవచ్చని నిర్మాతకు సూచించారట. బాహుబలి లీకుల గొడవ ఎంతవరకు వెళుతుందో మరి...!!