విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లు కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'గోపాల.. గోపాల'. ఈ చిత్రం విడుదల తేదీపై ఉన్న అనుమానాలు, సందేహాలు తొలగిపోయాయి. ముందుగా అనున్నట్టుగా జనవరి 15వ తేదీనే విడుదల చేసేందుకు హీరో పవన్ కళ్యాణ్ సమ్మతించారు.
ఈ చిత్రం ప్రోగ్రెస్పై నిర్మాత డాలీ మాట్లాడుతూ... 'భూకంపం కారణంగా తనకు జరిగిన అన్యాయానికి ప్రకృతే కారణమని నష్టపరిహారం ఇవ్వడానికి బీమా సంస్థ నిరాకరిస్తుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం రూపొందుతోంది. పవన్ కల్యాణ్, వెంకటేష్ కలయికలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్వామీజీగా మిథున్ చక్రవర్తి నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది' అని వివరించాడు.