బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ సినిమా.. ఆ ముగ్గురి హీరోయిన్లలో హరిప్రియ

ఆదివారం, 15 అక్టోబరు 2017 (11:48 IST)
బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.  ఓ హీరోయిన్ నయనతారగా, మరో హీరోయిన్‌గా నటాషా దోషిని ఎంపిక చేయనున్నారు. మూడో కథానాయిక పాత్ర కోసం రెజీనాను తీసుకున్నారనే టాక్ వచ్చింది. అయితే ఆమె బాలయ్యతో నటించే అవకాశానికి నో చెప్పడంతో ఆ పాత్రకు పిల్ల జమీందార్ హీరోయిన్‌ను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. 
 
గతంలో నాని హీరోగా వచ్చిన 'పిల్ల జమీందార్' సినిమాలో హరిప్రియ కథానాయికగా నటించింది. ఆ సినిమా హిట్ కొట్టినా ఆమె కెరీర్‌లో పెద్దగా అవకాశాలు ఏమీ లేవని.. దీంతో హరిప్రియ కన్నడ సినిమాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం హరిప్రియను బాలకృష్ణ తాజా చిత్రం కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఈ సినిమా యూనిట్ కూడా ధృవీకరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు