నయనతార, శింబు పేర్లు చెబితే పెటాకులైన ప్రేమికులు అని చటుక్కున చెప్పేస్తారు. ఐతే ఇలా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారు. అదే విచిత్రం అని కొందరనుకుంటుంటే, వాళ్లు నటించే చిత్రాల్లో చాలాచాలా చిత్రాలే జరుగుతున్నాయంటున్నారు కోలీవుడ్ సినీజనం.
కాకపోతే ఈ చిత్రం షూటింగులో స్పీడు బ్రేకర్లు పడుతున్నాయట. దర్శకుడు పాండిరాజ్, హీరో శింబుకు మధ్య గొడవలొచ్చాయని కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. అందువల్ల పాండిరాజ్ కెమేరాను పక్కనపడేసి సూర్య కోసం కథను రాస్తూ కూర్చుకున్నారట. మరోవైపు నయనతార కూడా డేట్స్ అయిపోతున్నాయ్ చూసుకోండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోందట. మొత్తానికి నిర్మాత కూడా అయిన శింబు కుడితిలో పడ్డ ఎలుక పిల్లలా గిలగిల తన్నకుంటున్నాడట.