ఈ చిత్రం శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే బంధువుకు చెందిన లైకా ప్రొడక్షన్స్ నిర్మించడంతో విడుదల సమయంలో పెద్ద వివాదాన్నే రేపింది. చిత్రాన్ని విడుదల కానీయమంటూ తమిళ సంఘాలు పెద్ద ఎత్తున థియేటర్ల వద్ద ఆందోళన నిర్వహించగా, చెన్నైలో రెండు థియేటర్ల అద్దాలను సైతం ధ్వంసం చేశారు.
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చొరవతో సమస్య పరిష్కారమై, ప్రశాంత వాతావరణంలో సినిమా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రం తొలి రోజునే కలెక్షన్ల వర్షం కురిపించింది.