శ్రీదేవి - శోభన్ బాబుతో తెలుగు తెరకు కేరళ అందం..

గురువారం, 9 ఫిబ్రవరి 2023 (09:32 IST)
Gouri Kishan
శ్రీదేవి - శోభన్ బాబు సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది గౌరీ కిషన్. జాను సినిమాలో మెరిసిన ఆమె.. చిరంజీవి పెద్ద కూతురు - అల్లుడు ఏర్పాటు చేసిన కొత్త బ్యానర్‌లో తెరకెక్కిన శ్రీదేవి శోభన్ బాబులో నటించింది. 
 
అలాంటి ఈ సినిమాకి ప్రశాంత్ దిమ్మల దర్శకత్వం వహించాడు. శ్రీదేవి - శోభన్ బాబు విలేజ్ నేపథ్యంలో నడిచే కథ. లవ్ డ్రామా జోనర్‌లో ఈ కథ నడుస్తుంది. సంతోష్ శోభన్ హీరోగా నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది.
 
ఇకపోతే.. కన్నడ.. మలయాళం.. తమిళ్ ఇండస్ట్రీల నుంచి టాలీవుడ్‏లోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ సినిమాతో కన్నడ సోయగం ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మరో కేరళ అందం గౌరీ కిషన్ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు