ఎన్టీఆర్ ఓ నిర్ణయానికి వచ్చేశారట.. ఏం జరుగుతుందో ఏమో?

బుధవారం, 17 సెప్టెంబరు 2014 (12:58 IST)
ఇదేంటి అనుకుంటున్నారా? ఎన్టీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం టాలీవుడ్‌లో పెద్ద సంచలనమైంది. ఇటీవల ఆయన నటించిన 'రభస' సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో ఎన్టీఆర్ ఓ మంచి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 
 
ఇందులోభాగంగా.. ముందుగా తన పారితోషికాన్ని బాగా తగ్గించుకున్నాడట. అలాగే, తన నిర్మాతలను పిలిచి కథానాయికలకు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టవద్దని చెప్పినట్టు సమాచారం. ఇక చిత్ర నిర్మాణం పరంగా కూడా ఖర్చును కంట్రోల్ చేయమని చెప్పాడట.
 
తన తాజా నిర్ణయాలను ప్రస్తుతం తాను చేస్తున్న బండ్ల గణేష్ సినిమా నుంచే ఆచరణలో పెడుతున్నట్టు సినీ వర్గాల్లో టాక్. అయితే, దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఎన్టీఆర్ అభినందనీయుడే!

వెబ్దునియా పై చదవండి