రూ.100 కోట్లకు పుష్ప-2 ఓటీటీ హక్కులు.. నిజమే?

శనివారం, 25 నవంబరు 2023 (21:49 IST)
పుష్ప 1: ది రైజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2021లో విడుదలైన ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. 
 
పుష్ప పాన్ ఇండియా రేంజ్‌లో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అందరూ ‘పుష్ప 2: ది రూల్’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది (2024) ఆగస్టు 15న పుష్ప 2 విడుదల కానుంది. 
 
ఇదిలా ఉంటే తాజాగా పుష్ప 2 సినిమా ఓటీటీ డీల్ గురించిన సమాచారం బయటకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ 'పుష్ప 2: ది రూల్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు తాజా సమాచారం బయటకు వచ్చింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్‌తో ఈ ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫాం పుష్ప 2 హక్కుల కోసం పోటీ పడింది. అయితే సీక్వెల్ రైట్స్ కోసం మేకర్స్ నుంచి భారీ డిమాండ్ రావడంతో అమెజాన్ ప్రైమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 
 
2021లో విడుదలైన "పుష్ప 1: ది రైజ్" సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో 30 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2: ద రూల్’ హక్కులను నెట్‌ఫ్లిక్స్ మూడు రెట్లు ఎక్కువ చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
దాదాపు రూ.100 కోట్లకు ఈ ఓటీటీ డీల్ జరిగినట్లు సమాచారం. పుష్ప 2 సినిమాకు ఫుల్ క్రేజ్ రావడంతో ఇంత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు నెట్ ఫ్లిక్స్ ముందుకు వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు