ప్రభాస్ నిర్ణయంతో ఆలోచనలో పడ్డ నాగ్

సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:54 IST)
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రాథేశ్యామ్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా..? అని ఎదురు చూస్తే.. మహానటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగ్ అశ్విన్‌తో సినిమాని ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అది కూడా ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాకుండా.. పాన్ వరల్డ్ అంటూ ఎనౌన్స్ చేసి సంచలనం సృష్టించారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని ఎదురు చూస్తుంటే... ప్రభాస్ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే.. బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ఎనౌన్స్ చేసి మరోసారి సర్ఫ్రైజ్ చేసాడు.
 
అయితే ఆదిపురుష్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి నాగ్ అశ్విన్ ఆలోచనలో పడ్డాడట. ఎందుకంటే.. రాథేశ్యామ్ పూర్తవ్వాలి. ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో సినిమా స్టార్ట్ చేస్తాడా..? ఆదిపురుష్ స్టార్ట్ చేస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. దీంతో నాగ్ అశ్విన్ తెగ టెన్షన్ పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆయన దగ్గర కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ కథలు వున్నాయట.
 
అందుచేత ఈ గ్యాప్‌లో ఓ చిన్న కథతో సినిమా చేద్దామా... ప్రభాస్ డేట్స్ ఇచ్చేవరకు ఆగుదామా..? అని ఆలోచిస్తున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆదిపురుష్‌, నాగ్ అశ్విన్‌తో మూవీ రెండూ ఒకేసారి చేయాలనుకుంటున్నాడని తెలిసింది. అందుచేత నాగ్ అశ్విన్ ఈ గ్యాప్‌లో చిన్న సినిమా చేయకుండా ప్రభాస్ కోసమే వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు