ప్రభాస్ కొత్తగా హీరోగా ఎంట్రీ అయ్యాక... కొత్తవారితో చేశాడు. తర్వాత సీనియర్స్తో చేసినా.. కొత్తవారిలో వున్న టాలెంట్ను బాగా వుపయోగించుకోవచ్చనేది ఆలోచన. బాహుబలి తర్వాత సీనియర్స్తో కాకుండా కొత్తవారితో చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రన్ రాజా రన్ చిత్రాన్ని చేసిన సుజిత్ను ఎంచుకున్నాడు.
ఇటీవలే సుజిత్ ఆయనకు ఓ కథ చెప్పాడట. అది చాలా బాగుందనీ, దాన్ని ఇంకా మెరుగులు దిద్దాల్సిందిగా సూచించాడు. ఈ విషయం విన్న సుజిత్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో స్వీట్ న్యూస్ చెబుతానని సన్నిహితులకు ప్రకటించాడు.