కాగా ఆ సమయంలో ఇండియా నుంచి యుద్ధానికి వెళ్లిన ఎస్21 సబ్ మెరైన్ నేవల్ ఆఫీసర్, తన బృందంతో 18 రోజుల పాటు సముద్ర గర్భంలోనే యుద్ధం చేశారు. ఈ సంఘటన ఇతివృత్తంగా తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నేవీ ఆఫీసర్గా బాహుబలిలో ప్రతినాయకుడిగా కనిపించి ప్రశంసలు అందుకున్న దగ్గుబాటి రానా కనిపించబోతున్నట్లు సమాచారం.