విజయ్ సరసన రష్మిక మందన..

గురువారం, 10 ఫిబ్రవరి 2022 (14:51 IST)
గీతగోవిందం హీరోయిన్ రష్మిక మందన బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమె విజయ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్, ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' సినిమా చేస్తున్నాడు. 
 
ఆ తరువాత సినిమాను ఆయన వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకున్నారని అంటున్నారు.
 
ఇక మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉందట. ఆ పాత్రకి పూజ హెగ్డేను తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ విజయ్‌తో పూజ 'బీస్ట్' సినిమా చేస్తోంది. అందువలన ఆమె ఈ ప్రాజెక్టులో ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు