బాహుబలి చిత్రం ఏళ్ళ తరబడి తీసినా ఆ చిత్రం విడుదల తర్వాత వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఏకంగా పద్మ అవార్డునే తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ ప్రస్తుతం జరుగుతోంది. కాగా, బాలీవుడ్లోనూ ఆఫర్లు వస్తున్నా వెళ్ళకుండా.. తెలుగుపైనే శ్రద్ధ పెడుతున్నట్లు ట్వీట్లు చేసేశాడు. కానీ కరన్ జోహార్తో వున్న సంబంధాలతో బాహుబలి-2 తర్వాత హిందీ చిత్రం చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.