మళ్లీ స్క్రీన్‌పై లవ్ స్టోరీ జంట.. నిజమేనా?

మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (19:50 IST)
లవ్ స్టోరీ పెయిర్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించనుంది. అవును మీరు చదువుతున్నది నిజమే. అసలు సంగతి ఏంటంటే.. అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం గీతాఆర్ట్స్‌లో ఒక సినిమా చేస్తున్నారు. చందూ మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 
 
తాజాగా ఈ మూవీలో నటించబోయే హీరోయిన్‌ని ఎంపిక చేశారు. హీరోయిన్ ఎవరు అనేది చెప్పకుండా కేవలం ఎంట్రీని మాత్రం తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేశారు. 
 
ఆ వీడియో పోస్ట్ చూసిన నెటిజెన్స్.. ఆమె సాయిపల్లవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు