ఫేస్బుక్ ద్వారా నటుడిగా మారి పబ్లిసిటీని పూర్తిగా వుపయోగించుకుని నటుడైన సంపూర్ణష్ బాబుకు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. 'హృదయ కాలేయం' చిత్రంతో పేరు తెచ్చుకున్నా.. రెండవ సినిమా... కొత్తజంటలో... ఆయన ట్రాక్ హైలైట్ అవుతుందనీ అల్లు శిరీష్పై పడుతుందని భావించి... మొత్తంగా సంపూ ట్రాక్ను కట్ చేశారంట.
రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో సంపూ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం ఆయన స్టయిల్ను కొత్తగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంపూతో.. సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాలు రన్నింగ్లో వున్నాయి. వర్మ సినిమా ఏ రేంజ్లో వుంటుందో.. అందులో ఎవరెవరిపై ఎన్ని సెటైర్లు వుంటాయో చూడాలి.