హీరోయిన్‌గా మళ్ళీ రాణిస్తానంటున్న 40 యేళ్ళ నటి

గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:29 IST)
సిమ్రాన్. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, ఉర్దూ బాషలలో వివిధ చిత్రాల్లో నటించింది సిమ్రాన్. తెలుగులో అయితే అగ్రహీరోలందరితోను నటించి మెప్పించింది. సిమ్రాన్ అంటే ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు సినిమా థియేటర్ల ముందు క్యూకట్టేవారు. ఆమె నటన అంటే అంత ఇష్టపడేవారు. అయితే తన చిన్ననాటి స్నేహితుడితో పెళ్ళి చేసుకున్న తరువాత సిమ్రాన్ సినిమాలకు దూరమయ్యారు.
 
అయితే 40 యేళ్ళ తరువాత అంటే సరిగ్గా గత యేడాది ఆమె రజినీకాంత్‌తో కలిసి ఒక సినిమాలో నటించారు. మళ్ళీ ఏ సినిమాల్లో నటించలేదు. కానీ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ కొనసాగుతుండడం.. ఇదంతా పూర్తయిన తరువాత మళ్ళీ సినిమాల్లో నటిస్తానంటోంది సిమ్రాన్. అది కూడా యువ నటులతోనే అంటోంది సిమ్రాన్.
 
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లోనే నటిస్తానని దర్సకనిర్మాతలకు చెబుతోందట సిమ్రాన్. ఆమె కోసం తమిళంలో ఇప్పటికే ఖష్బూ భర్త సుందర్ సి. ఒక కథ కూడా సిద్థం చేసినట్లు తెలుస్తోంది. సిమ్రాన్‌కు గతంలో ఉన్న క్రేజ్ ఒక్కసారిగా రావడానికి ఈ సినిమా బాగా సహకరిస్తుందంటున్నాడట సుందర్ సి.
 
అంతేకాదు సుందర్ చెప్పిన కథ సిమ్రాన్‌కు బాగా నచ్చిందట. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని సిమ్రాన్ ఆసక్తిగా ఎదురుచూస్తోందట. లాక్ డౌన్ ఎంత త్వరగా పూర్తయితే మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్ళిపోవాలని ఎంతో ఉత్సాహంగా ఉందట సిమ్రాన్. మరి చూడాలి సిమ్రాన్‌కు ఏ విధంగా సినిమాలు కలుసొస్తాయన్నది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు