మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన 'శ్రీమంతుడు' చిత్రం అప్పుడే చర్చల్లోకి వెళ్లిపోయింది. వన్ నేనొక్కడినే చిత్రంలో తన కాళ్ల వెంట హీరోయిన్ను 'కుక్క' మాదిరిగా మహేష్ బాబు తిప్పుకున్నాడంటూ అప్పట్లో తెగ గొడవ జరిగింది. కానీ తాజా చిత్రం శ్రీమంతుడులో మహేశ్ బాబు, శృతి హాసన్ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తోంది. జతకలిసే.. అంటూ సాగే పాటకు సంబంధించి ట్రైలర్లో శ్రుతిహాసన్ కాలుని మహేష్ చేత్తో పట్టుకుంటాడు. ఈ సీన్ చూసిన వారు మహేష్ బాబు, హీరోయిన్ కాలు పట్టుకోవడమేంటని ఆశ్చర్యపోతున్నారు.