మరోవైపు తెలుగు సినిమాలో తొలిసారిగా సన్నీ లియోన్ నటించిన చిత్రం కరెంట్ తీగ. ఈ చిత్రం ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత, ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ శృంగారతారను తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అదే క్యూరియాసిటీ ఇప్పుడు దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా చూపుతున్నారు.
ఇదే అంశంపై పూరీ స్పందిస్తూ.. "నిజమే... నేను సన్నీ లియోన్కి వీరాభిమానిని. ఆమె నటించిన తెలుగు సాంగ్ చూడాలని ఎంతో ఆశగా వుంది. అందుకే, ఆ పాట చూపించమంటూ మనోజ్ని అడిగాను కూడా. ఈ సినిమా తర్వాత ఆమె ఖచ్చితంగా తెలుగులో బిజీ అవుతుందనుకుంటున్నాను. ఎందుకంటే, మన ప్రేక్షకులకు ఆమె నచ్చుతుంది. మీకో విషయం చెప్పనా... గతేడాది దీపావళిని నేను, రాంగోపాల్ వర్మ కలసి ముంబైలో సన్నీ లియోన్తోనే సెలెబ్రేట్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు.