బీరువా చిత్రంతో టాలీవుడ్లో తెరంగేట్రం చేసిన ఢిల్లీ సుందరి సురభిని అదృష్టం వరించింది. అసలు విషయానికొస్తే పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమాలో కథానాయికగా సురభిని ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఎక్స్ ప్రెస్ రాజా మూవీలో శర్వానంద్తో ఆడిపాడిన సురభికి.. ఆ మూవీ హిట్ కావడంతో మంచి పేరే వచ్చింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'రోగ్' సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత పూరీ కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడని సినీవర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి రీమిక్స్ అనే టైటిల్ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.