భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ జీవితంపై తీసిన బయోపిక్ 'ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని కేవలం హిందీలో మాత్రమే కాకుండా.. తెలుగు, తమిళం వంటి భాషల్లోకి విడుదల చేస్తున్నారు. ధోనీకి ఉన్న బీభత్సమైన క్రేజ్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించగలదనే నమ్మకం ఏర్పడుతోంది. రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఈ సినిమాకు గట్టిగానే వసూళ్లు ఉండే అవకాశం ఉందని సినీ నిపుణులు అంటున్నారు.
ఈ సంగతిలా ఉంటే.. వాస్తవానికి దగ్గరగా ఉంటుందని ధోనీ స్వయంగా చెప్పిన ఈ సినిమా కథనం ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ధోనీ ఎదిగి వచ్చిన తీరు, కుటుంబం, చదువు, క్రికెట్లో తొలి అడుగు, ఆటగాడిగా ఎదుర్కొన్న అనుభవాలు, కెప్టెన్గా రాణింపు తదితరాల మిళితం అయిన ఈ సినిమాలో ఒక హీరోయిన్ ప్రస్తావన ఉంటుందా? లేదా ? అనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఇలా ధోనీ బయోపిక్లో ప్రస్తావన గురించిన వార్తల్లో ఉన్నది మరెవరో కాదు లక్ష్మీ రాయ్. పలు తెలుగు సినిమాల్లో నటించిన రాయ్ ప్రధానంగా తమిళంలో నటించింది.
ఐపీఎల్ సందర్భంగా 2008లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినట్లు చెప్పింది లక్ష్మీరాయ్. ఆ సమయంలోనే ధోనీ పరిచయమయ్యాడని తెలిపింది రాయ్ లక్ష్మీ. వీరిద్దరూ చాలా క్లోజ్గా మూవ్ అయినట్లు కూడా వెల్లడించింది. కాగా ఈ సినిమాలో ధోనీ భార్య గురించే కాకుండా.. వివాహానికి పూర్వపు గర్ల్ ఫ్రెండ్ ఒకమ్మాయి ప్రస్తావన కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
మరి లక్ష్మీ రాయ్తో వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తావన ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే... లక్ష్మీరాయ్ మరికొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ''ఆ సినిమాలో మీ ప్రస్తావన ఉంటుందా? అంటే.. ధోనీతో డేటింగ్ చేసింది నేను మాత్రమే కాదు కదా!'' అని మరో బాంబు పేల్చింది లక్ష్మి. ఇంకా వేరే హీరోయిన్లు కూడా ధోనీతో అప్పట్లో గడిపారనే శ్లేషతో మాట్లాడింది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఈ విషయమే బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.