త్రిషకు పెరిగిందట... ఏమి పెరిగింది..?

శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (21:46 IST)
ఇఫ్పుడు ఎక్కడ చూసినా దక్షిణాది అందాలభామ త్రిష మాటే.. ఆమెకు పెరిగిందట.. ఏమి పెరిగిందని ఆరా తీస్తే ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయిందట. ఇప్పుడు తన ఫాలోవర్స్ సంఖ్య 20 లక్షలకు చేరిందని త్రిష తెలిపింది. ఆ అమ్మడు తనకు పెరిగిన సంఖ్యపై అభిమానులకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది.
 
 
ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలు, ఇష్టాయిష్టాలు వంటి అంశాలను ట్విట్టర్ ద్వారా అభిమానుల ముందు ఉంచుతున్న త్రిష తన ఖాతాను 2009 జులైలో ప్రారంభించింది. సహజనటుడు కమల్ హాసన్ నటించిన, రిలీజ్ కు సిద్ధంగా ఉన్న 'చీకటి రాజ్యం' చిత్రంలో ప్రస్తుతం త్రిష నటిస్తోంది. లైమ్ లైట్‌లో ఉండడానికి చేసే ప్రయత్నాలన్నమాట. 

వెబ్దునియా పై చదవండి