రాజకీయ నేతగా, కేంద్ర మంత్రిగా విధులు నిర్వహించిన తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. దీంతో చిరంజీవి 150వ చిత్ర విశేషాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, డైలాగ్ కింగ్స్ పరుచూరి బ్రదర్స్ కథ, మాటలను సమకూర్చుతున్నారు.
అయితే, ప్రస్తుతం వివివినాయక్, పరుచూరి బ్రదర్స్లు కలిసి మీడియాతో పాటు ఎవరికీ కంటపడని ప్రదేశానికి వెళ్లి కథా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దీన్ని ధృవీకరించుకునేందుకు వివి వినాయక్ మొబైల్కు ఫోన్ చేస్తే... ది సబ్స్క్రైబర్ ఔటాఫ్ కవరేజ్ ఏరియా అంటూ సందేశం వినిపిస్తోంది. దీంతో మరికొన్ని గంటల్లో జరుగనున్న చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో 150వ చిత్రంపై ప్రకటన వెలువడటం సందేహాస్పదంగా మారింది.