బాలీవుడ్ సుందరాంగి ఐశ్వర్యా రాయ్... ఈమెకు ఫోన్ మాట్లాడ సమయమే లేదట. అయితే, ఆమె ఫోన్కు ఎపుడు ఫోన్ చేసినా ఎంగేజ్ టోన్ వినిపిస్తుంది. సఫైగిరి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... ఇపుడు ప్రతి ఒక్కరూ తమతమ ఫోన్లలో చాలా బిజీగా ఉంటున్నారు. అందుకే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టిసారించలేకపోతున్నాం అని చెప్పారు. కనీసం క్షణం కూడా ఫోన్ను విడిచిపెట్టి ఉండలేక పోతున్నారని వాపోయారు.
ముఖ్యంగా... తమ విధులు, దినచర్యలు, లైఫ్స్టైల్, సోషల్ మీడియా ఇలా 24/7 ఎంతో బిజీగా గడుపుతున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని తాను నిశితంగా గమనించినట్టు చెప్పారు. అందుకే ఇతరులపై దృష్టిసారించేందుకు, మాట్లాడేందుకు సమయం లేదన్నాని ఆమె చెప్పుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ఐశ్వర్యారాయ్తో పాటు.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి, ఇండియా గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరూన్ పూరీ తదితరులు పాల్గొన్నారు.