విక్రమ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించి తాజాగా విడుదలైన చిత్రం ''24''. ఈ చిత్రంలో సూర్య సరసన సమ౦త, నిత్యామీనన్ హీరోయిన్గా నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే దేశ వ్యాప్తంగా మొత్తం రూ.25 కోట్లను వసూలు చేసింది. సూర్య కెరీర్లో ఇంత మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ వారంలో తెలుగు, తమిళంలో పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాకపోవడంతో వచ్చేవారం వరకు కలెక్షన్ల పరంగా ఎటువంటి పోటీ ఉండదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాకు అన్నివర్గాల నుండి పాసిటివ్ టాక్ లభించింది. చాలాకాలం నుంచి మంచి విజయాలు లేక సతమతమవుతున్న సూర్యకు ''24'' ఆ లోటును ఒక విధంగా తీర్చిందనే చెప్పాలి.