యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న "దిల్బర్" (ట్రైలర్)

గురువారం, 5 జులై 2018 (13:52 IST)
బాలీవుడ్ కొత్త చిత్ర "దిల్బర్" ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సత్యమేవజయతే, జాన్ అబ్రహాం, నోరా ఫతేహి, తనిష్క్ బగ్చీ, నెహా కక్కర్ నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం ట్రైలర్‌ యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. ఇప్పటికే ఎనిమిది కోట్ల మంది నెటిజన్లు ఈ ట్రైలర్‌ను వీక్షించారు. ఫలితంగా ఇది యూట్యూబ్ ట్రెండింగ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.
 
కాగా, ఈ చిత్రానికి మిలప్ మిలన్ జవేరి కథను అందించి దర్శకత్వం వహించారు. భుషణ్ కుమార్, కిషన్ కుమార్, నిఖిళ్ అద్వానీలు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో జాన్ అబ్రహాం - మనోజ్ బాజ్‍పేయి, అమృతా కన్విల్కర్, ఐషా శర్మాలు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రం ట్రైలర్ సెమ్మె హాట్‌గా ఉంది. ఆ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు