సినీ పరిశ్రమలో జంటలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. గాఢంగా ప్రేమించి పెళ్లికి ముందే విడిపోతున్న వారు కొందరైతే, పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోతున్న వారు మరికొందరు. తాజాగా ఈ విడిపోయిన జంటల జాబితాలో మళయాళీ భామ కళ్యాణి, దర్శకుడు సూర్య కిరణ్ జంట కూడా చేరిపోయింది. రాజశేఖర్ సినిమా ''శేషు''తో కళ్యాణి టాలీవుడ్కి పరిచయమైంది. ఆ తర్వాత వరుస హిట్లతో టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది.
క్రమంగా జగపతిబాబు, రవితేజ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అవకాశాలు తగ్గగానే దర్శకుడు సూర్య కిరణ్ని ప్రేమించి పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. అయితే ఈ జంట మధ్య ఇటీవల మనస్పర్థలు చోటుచేసుకున్నాయట. వీటి కారణంగానే వారిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారని, విడాకులకు సిద్ధం అయ్యారని మాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.