సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ని నామినేట్ చేసిన నటి పూర్ణ

సోమవారం, 10 ఆగస్టు 2020 (22:49 IST)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. ఒకరి నుండి మరొకరికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ సెలెబ్రిటీలు తమవంతుగా మొక్కలు నాటుతున్నారు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖ సినీనటి పూర్ణ గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించి మూడు మొక్కలు నాటారు.
 
ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ... గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అపూర్వమైనదని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఒక ఐకానిక్ ప్రోగ్రాంగా దేశవ్యాప్తంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్బంగా తనకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎంపీ సంతోష్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనీ అలాగే తను మరో ఐదుగురుకి ఛాలెంజ్ ఇస్తున్నట్టు చెప్పారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్, డా.ధీరజ్, డీసీపీ సందీప్ ప్రముఖ సినీనటి ప్రియమణి అలాగే డైరక్టర్ రవిబాబులను మొక్కలు నాటాల్సిందిగా నామినేట్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు