లోకల్ ట్రైన్‌లో ఓ వ్యక్తి తాకరాని చోట తాకాడు.. అదితీరావు హైదరీ

గురువారం, 5 ఆగస్టు 2021 (10:17 IST)
ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన అదితీరావు హైదరీ తన జీవితంలో ఎదురైన షాకింగ్ అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. తాను టీనేజ్‌లో ఉన్న టైమ్‌లో లోకల్ ట్రైన్‌లో ట్రావెలింగ్ చేసేదానినని తనకంటే వయస్సులో పెద్ద అయిన వ్యక్తి తనను తాకకూడని చోట తాకాడని వెల్లడించింది. మొదట రైలులో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో అనుకోకుండా జరిగి ఉండవచ్చని భావించానని తెలిపింది.
 
అయితే ఆ వ్యక్తి తన శరీర భాగాలను మళ్లీమళ్లీ తాకడంతో అతనికి బుద్ధి చెప్పాలని తాను అనుకున్నానని ఆ తర్వాత ఆ వ్యక్తిని ఆపి తాను చెంప పగులగొట్టానని తెలిపింది. చేతిలో ఉన్న కాలేజ్ బ్యాగ్‌ను సైతం ఆ వ్యక్తిపై విసిరికొట్టడంతో పాటు అలాంటి పనులు భవిష్యత్తులో ఎప్పుడూ చేయవద్దని వార్నింగ్ ఇచ్చానని వెల్లడించింది.
 
ఆడపిల్లలకు తల్లిదండ్రులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలని అదితిరావు హైదరీ సూచించింది. పిల్లలకు సమాజం గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో మహాసముద్రం సినిమాలో నటిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు