పోసానిని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించండి (video)

బుధవారం, 29 సెప్టెంబరు 2021 (12:57 IST)
పోసాని వ్యాఖ్యలపై మెగా డాటర్ నిహారిక ఫైర్ అయ్యారు. తక్షణం పోసానిని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలని, ప్రభుత్వం స్పందించి అతడిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు నిహారిక.
 
సినిమా ఫంక్షన్లో తన బాబాయ్ ఎవరి ఆడవాళ్ళను ఉద్దేశించి ఎటువంటి కామెంట్లు చేయలేదని, కేవలం జగన్ మెప్పుకోసమే... పోసాని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు నిహారిక.
 
గత నాలుగు రోజుల నుంచి జగన్-పవన్‌ల మధ్య వార్ నడుస్తోంది. జనసేన పార్టీ కార్యకర్తలు, వైసిపి కార్యకర్తలు మధ్య తిట్ల పురాణం తారాస్థాయికి చేరింది. 
 
పవన్‌కు అండగా నాగబాబు నిలబడి కుక్కలు మొరిగాయ్ అనుకో అని చెప్పడం.. నాగబాబు కుమార్తె నిహారిక కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. నిహారిక తాజాగా స్పందించడం సినీ పరిశ్రమలో ఒక పెద్ద చర్చే జరుగుతోంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు