అల వైకుంఠ‌పుర‌ములో.. ఏడు నిమిషాల్లోనే సెన్సేష‌న్, ఏంట‌ది?

గురువారం, 12 డిశెంబరు 2019 (21:17 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో. ఈ చిత్రం టీజర్ విడుదలైన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. 
 
తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్,వారి ఆనందానికి ఆకాశమే హద్దు అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ టీజర్లో “నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా” అని చెప్పే డైలాగ్ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
 
పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్లో ఈ అల వైకుంఠపురంలో చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. మ‌రి.. సాంగ్స్‌తో, టీజ‌ర్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అల‌.. వైకుంఠ‌పుర‌ములో థియేట‌ర్లో ఇంకెంత సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో.?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు