కేన్సర్తో బాధపడుతున్న నలుగురు చిన్నారులను సినీ హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న అల్లు అర్జున్ వారిని కలుసుని వారిని ఉత్సాహపరుస్తూ ఉల్లాసంగా గడిపారు. చిన్నారుల పరిస్థితిని వైద్యులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు గిప్ట్లు అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చివరిదశలో ఉన్న చిన్నారుల కోరిక తీర్చడం గొప్ప విషయమని అన్నారు. ఈ దశలో పిల్లలకు సాయం చేయడం కంటే మనోధైర్యం ఇవ్వడమే ముఖ్యమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న మేక్ ఎ విస్ సంస్థకూ అందరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఆర్గనైజేషన్ తరపున పిలుపు వస్తే ఏ సెలబ్రెటి అయినా వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.