20న 'భీమ్లా నాయక్' నుంచి మరో అప్డేట్

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (16:23 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన… 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌'కు ఇది రీమేక్. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇపుడు తిరిగి ప్రారంభమైంది. 
 
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా 'భీమ్లా నాయక్' టైటిల్‌ను ప్రకటించి పవన్ ఫాన్స్‌లో ఊపు తెప్పించింది. అయితే భీమ్లా నాయక్ సినిమా నుంచి  తాజాగా మరో అప్డేట్ రాబోతోంది. 'ఇప్పటివరకు పవర్ తుఫాను చూశారు. 
 
ఇప్పుడు గెట్ రెడీఫర్... ఇవాళ సాయంత్రం 04;05  గంటలకు సిద్ధంగా ఉండండి' అంటూ ఓ సందేశాన్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత డేనియర్ శేఖర్ గురించి ఈ నెల 20వ తేదీన పోస్టర్ రిలీజ్ చేయనున్నట్టు అందులో పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు